ACB Raids in Nizamabad(Local news Telangana): నిజామాబాద్ లో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. మున్సిపల్ ఆఫీసులో పని చేసే ఓ అధికారి ఇంట్లో నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు ఉన్నట్లు వారు గుర్తించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతడు ఆదాయానికి మిచి భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
Also Read: ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని గుత్తేదారే భరిస్తారు: ఉత్తమ్
ఇందుకు సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరేందర్ ఇంటితోపాటు కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆ ఆఫీసర్ అసలు రంగు బయటపడింది. ఏసీబీ సోదాల్లో మొత్తం రూ. 2,93,81,000 నగదు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. మొత్తం రూ. 6 కోట్ల 7 లక్షల విలువగల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.
నిజామాబాద్ : మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం…
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.
భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం.
నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో… pic.twitter.com/zJr45r6hge
— BIG TV Breaking News (@bigtvtelugu) August 9, 2024