Adibatla Kidnap Case : ఆదిబట్ల మన్నెగూడలో వైశాలి, నవీన్ రెడ్డిల క్రైమ్ లవస్టోరీలో ట్విస్టులు మీద ట్విస్టులు వచ్చి పడుతున్నాయి. వైశాలి ఇంటి పై నవీన్ రెడ్డి దాడి చేసి ఆ అమ్మాయిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి తలపై దారుణంగా దాడి చేశారు నవీన్ రెడ్డి అనుచరులు. మరో వైపు నవీన్ రెడ్డి వైశాలిని తీసుకొని విజయవాడ తీసుకొని వెళ్తుండగా.. మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేశారు. నవీన్ రెడ్డి పోలీసులకు చెప్పిన విషయాలు షాక్కు గురి చేస్తున్నాయి.
వైశాలితో తనకు 2021 ఆగస్టులోనే పెళ్లైందని నవీన్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. ఈ విషయాన్ని వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి కొట్టి పారేస్తున్నారు. వైశాలికి నవీన్ రెడ్డితో పెళ్లి కాలేదని.. ఆ సమయంలో వైశాలి డెంటల్ ట్రీట్మెంట్ తీసుకొంటుందని.. దానికి సంబంధించిన ఆస్పత్రి బిల్స్ కూడా తమ వద్ద ఉన్నాయంటున్నారు. అయితే బీడీఎస్ పూర్తయ్యేవరకు పెళ్లైన విషయం బయట పెట్టొదని వైశాలి కండీషన్ పెట్టినట్లుగా నవీన్ రెడ్డి చెబుతున్నాడు.
వైశాలిని నవీన్రెడ్డి సైకోలా వేధించాడని ఆమె తండ్రి దామోదర్ రెడ్డి పోలీసులకు వివరించాడు. వైశాలితో పెళ్లైందని నిరూపించేందుకు నవీన్ రెడ్డి కుట్రలు చేశాడని దామోదర్ రెడ్డి అంటున్నాడు. ఓ వాహనం కొని.. వైశాలిని అందులో నామినీ చేయించి.. దాని ద్వారా ఎల్బీనగర్ కోర్టులో భార్యను పంపించడం లేదని పిటిషన్ వేసినట్లు చెప్పాడు. నవీన్ రెడ్డి కిడ్నాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి పడుతున్నాయి.