EPAPER
Kirrak Couples Episode 1

Sri Satya Sai District : ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీ చెలగాటం.. నాటు వైద్యం వికటించి ఇద్దరి మృతి..

Sri Satya Sai District : ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీ చెలగాటం.. నాటు వైద్యం వికటించి ఇద్దరి మృతి..

Sri Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో ఓడీసీ మండలంలో దారుణం చోటు చేసుకుంది. నాటు వైద్యం పేరుతో ఓ ఆర్ఎంపీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. టి.కుంట్లపల్లి, బసప్పగారి పల్లెల్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పులు బాగుచేస్తానంటూ అంటూ ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన సూది మంది వికటించి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న పలు గ్రామాలకు చెందిన 30 మంది.. అమడగూరు మండలం పూలకుంట్లపల్లిలో ఈనెల 3న చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందిన ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. వీరందరికీ ఆర్ఎంపీ సూది మందు ఇచ్చాడు. సూది మందు తీసుకున్న రోజు నుంచి టి.కుంట్లపల్లికి చెందిన పప్పురమ్మ, ఓబులేసు, సాహెబ్ పీరాలకు మోకాళ్ల నొప్పులు అధికమయ్యాయి.

వీరితోపాటు బసప్పగారిపల్లికి చెందిన రామప్ప, ఉత్తన్నలకు మోకాళ్ల నొప్పులు పెరిగిపోయాయి. విపరీతంగా వాపులు రావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీరిలో పప్పురమ్మ, రామప్పల పరిస్థితి విషమించి మరణించారు. ఓబులేసు, సాహెబ్ పీరా, ఉత్తన్నల పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పప్పురమ్మ, రామప్ప మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఆర్తనాదాలలు మిన్నంటాయి. ప్రభుత్వం ఆర్ఎంపీ వైద్యునిపై వెంటనే చర్యలు చేసుకోవాలని బాధితుల బంధువులు కోరుతున్నారు.


Tags

Related News

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

YS Jagan: వైఎస్ జగన్‌‌కు కామ్రెడ్లే దిక్కవుతారా?

Home Minister Anitha : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?

YS Sharmila: కూటమి సర్కార్‌ని ప్రశ్నిస్తూ.. జగనన్నపై షర్మిల బాణాలు

Roja: పవన్‌కు ఏం తెలీదు.. బాబుకు బుద్ది లేదు.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన రోజా, మదురైలో పూజలు

AP Govt: సలహా ఇవ్వండి.. సర్టిఫికెట్ తీసుకోండి.. ఏపీ సీఎం ఐడియా అదిరింది కదూ..

Jagan: జగన్ అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. 12వ సారి..

Big Stories

×