EPAPER

Chiranjeevi: కేరళ సీఎంను కలిసి విరాళం అందజేసిన మెగాస్టార్

Chiranjeevi: కేరళ సీఎంను కలిసి విరాళం అందజేసిన మెగాస్టార్

Chiranjeevi: కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలు ఎంత విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షాల వలన కొండచరియలు విరిగి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరెంతోమంది గాయాలపాలయ్యారు. ఇంకెంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు ప్రభుత్వానికి అండగా నిలబడుతుంది.


ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు.. కేరళ ప్రభుత్వానికి విరాళాలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే. వయనాడ్ బాధితుల సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తాను, రామ్ చరణ్ కలిసి రూ. కోటి రూపాయలు అందిస్తున్నట్లు చిరు ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజాగా నేడు మెగాస్టార్ స్వయంగా కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి.. కోటి రూపాయల చెక్ ను అందజేశారు. వయనాడ్ విధ్వంసం గురించి కొద్దిసేపు సీఎంతో చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరుతో పాటు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, రష్మిక లాంటి హీరోలు విరాళాలు అందించగా.. కోలీవుడ్ నుంచి సూర్య, విక్రమ్, కమల్ హాసన్ తదితరులు విరాళాలు అందించారు.


ఇక చిరంజీవి కెరీర్ విషయానికొస్తే … ప్రస్తుతం చిరు, విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×