AP Govt latest news(Andhra pradesh today news): బ్రెయిన్ డెడ్ అయి అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం తరపున అంత్యక్రియలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగానే మార్గమదర్శకాలను కూడా విడుదల చేసింది. అవయవ దానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుప్రతిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆసుపత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్కు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అంతే కాకుండా జీవన్మృతుడికి సంబంధించిన భౌతిక కాయానికి తగిన గౌరవం ఇచ్చేలా చూడాలని.. అంత్యక్రియలు కూడా ప్రభుత్వం తరపున నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపింది. అంత్యక్రియలకు 10 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు జిల్లా కలెక్టర్ తరుఫున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని తెలిపింది.