Indonesia : ఇండోనేసియాలోని ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. పశ్చిమ సమత్రా ప్రావిన్స్లో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ప్రైవేటు కంపెనీకి చెందిన కోల్మైన్లో ప్రమాదకరమైన మీథేన్ లాంటి వాయువుల కారణంగానే పేలుడు జరిగిందని అధికారులు వెల్లడించారు. బ్లాస్ట్ కారణంగా గాయపడిన మరో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.
విషవాయువులు పీల్చడం వల్లనే కార్మికులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ శాతం కాలిన గాయాలతోనే చనిపోయారని తేలింది. దాంతోపాటు ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు