KTR : బాసర ట్రిపుల్ ఐటీలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీలో కల్పిస్తున్న సౌకర్యాలపై వివరించారు. ఇంజనీరింగ్ పిల్లలందరికీ గతంలో ల్యాప్టాప్లు అందిస్తామని హామీఇచ్చామని, ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామన్నారు. 2 వేల 200 ల్యాప్టాప్లను విద్యార్థులందరికీ అందిస్తున్నామని తెలిపారు. అలాగే పీ1, పీ2 తరగతుల విద్యార్థులకు 1,500 డెస్క్ టాప్లను అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.