Antim Panghal Reaction(Today’s sports news): భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్కు భారత ఒలింపిక్ అసోసియేషన్ భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్లో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు మూడేళ్ల నిషేధం విధించింది. అయితే, ఈ నిషేధంపై పంఘాల్ స్పందించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నన్ను పోలీసులు తీసుకెళ్లారనడం తప్పు. బుధవారం మ్యాచ్ ఓడిపోయిన తరువాత నాకు జ్వరం వచ్చింది. హోటల్లో ఉన్న నా సోదరిని చూసేందుకు అనుమతి కోరగా.. లభించింది. ఆ తర్వాత హోటల్కు వెళ్లాను. ఈ క్రమంలోనే క్రీడాగ్రామంలో ఉన్న నా లగేజీ అవసరమైంది. దీంతో నా అక్రిడిటేషన్ కార్డుతో నా సోదరి అక్కడికి వెళ్లింది.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. అంతిమ్ పంఘాల్పై మూడేళ్ల నిషేధం
అనంతరం వారిని లగేజీ అడిగింది. అక్కడున్న సిబ్బంది అక్రిడిటేషన్ కార్డును తీసుకుని, వెరిఫికేషన్ కోసం నా సోదరిని పోలీసుల వద్దకు తీసుకెళ్లారు. క్యాబ్ డ్రైవర్తో కోచ్ గొడవ పడ్డాడంటూ సిబ్బంది చెప్పారు. కానీ, అందులో నిజం లేదు’ అంటూ అంతిమ్ పేర్కొన్నది.