Mandous Cyclone : తమిళనాడుతో పాటు ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మాండౌస్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో అరుణా నది ఉగ్రరూపం దాల్చింది. బొబ్బరాజుపాలెం, కన్యకాపురం, ఆదిఆంధ్రవాడ గ్రామాలకు వెళ్లే మార్గంలో అరుణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో… ఈ మార్గంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న అరుణా నది వైపు ప్రజలు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు