గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.
ఆ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారకంగా ప్రకటించారు. ఈరోజు ఉదయం 9.42 నిముషాలకు నిశ్చితార్ధం అయినట్లు తెలిపారు.
శోభితాను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. గాడ్ బ్లెస్.. 8.8.8.. అంతు లేని ప్రేమకు ఆరంభం అంటూ నాగార్జున ట్వీట్ చేశాడు.
ఇక శోభిత విషయానికి వస్తే 2013లో ఫెమినా మిసి ఇండియా టైటిల్ గెలుచుకుంది.
2016 లో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత అడవి శేష్ సరసన గూఢాచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఇక ఈ బ్యూటీ అటు కోలీవుడ్ లోను, బాలీవుడ్ లోను సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సరీస్ లలో నటించింది. ఈ మధ్యనే హాలీవుడ్ లోను నటించింది ఈభామ.
నాగ చైతన్య విషయానికి వస్తే కొన్ని ఏళ్ల పాటు ప్రేమించుకుని సమంతను 2017లో వివాహం చేసుకున్నాడు.
ఫస్ట్ లో బాగేనే ఉన్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు.
అయితే ఈ మధ్యకాలంలో నాగ చైతన్య , శోభిత మధ్య రిలేషన్ పుకార్లు వినిపించాయి.
ఇదే నిజం చేస్తూ ఈ లవ్ కపుల్ ఎంగేజ్మెంట్ అఫీషియల్గా జరిగింది.
మరో ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏంటంటే.. ఇదే రోజున చైతూకి సమంత ప్రపోజ్ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.