EPAPER

Janmabhoomi -2: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. ఇకనుంచి ఫటాఫట్ పరిష్కారం కానున్న సమస్యలు

Janmabhoomi -2: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. ఇకనుంచి ఫటాఫట్ పరిష్కారం కానున్న సమస్యలు

Janmabhoomi -2: ఏపీ వాసులకు శుభవార్త. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జన్మభూమి-2ను త్వరలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు.


త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని అందులో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మొదటిదశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read: కందిపప్పు కోసం ఢిల్లీకి వచ్చాం: మంత్రి నాదెండ్ల


ఇదిలా ఉంటే.. చిలకలూరిపేటలో అన్న క్యాంటీన్, టిడ్కో ఇళ్ల నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. అన్ని వసతులతో కూడిన ఇళ్లను నిర్మిస్తామన్నారు. అదేవిధంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే హక్కు పత్రాలను జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. మార్చి చివరి వరకు అన్ని హంగులతో లబ్ధిదారులకు వాటిని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Tags

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×