ఇప్పటికే అరకు, పాడేరుకు చెందిన వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను తాడేపల్లి పిలిపించి జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు ఎవరు గురికావొద్దంటూ హితబోధ చేశారు. అరకు, పాడేరులో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా వైసీపీ వాళ్లే కావడంతో ఎంపీటీసీ జడ్పీటీసీలను, వాళ్ల కుటుంబ సభ్యులను తాడేపల్లి పిలిపించుకున్నారు. కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుందని ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.
నేడు నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లతో జగన్ భేటీ కానున్నారు. రాత్రే MPTC, ZPTC తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్నారు. విశాఖ కార్పొరేషన్ కార్పొరేటర్లు, పెందుర్తి, మాడుగుల, చోడవరం ఎంపీటీసీ జడ్పీటీసీలు.. కాసేపట్లో తాడేపల్లికి వెళ్లనున్నారు. ఉమ్మడి జిల్లాల వారితో మాట్లాడాక క్యాంపులకు తరలించనున్నారు. ఈనెల 29 వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్యాంపుల్లోనే ఉండనున్నారు. బెంగళూరు, హైదరాబాదులో క్యాంపులు ఏర్పాటుచేయడానికి వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
Also Read: పాస్ పుస్తకాలపై.. జగన్ బొమ్మ తీసేసిన కూటమి ప్రభుత్వం.!
అటు వైసీపీ.. స్థానిక ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ మేరకు నేడు పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించనున్నారు.