YSRCP Former MLA resigned: వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్చే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొరబాబు మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైసీపీ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. అయితే నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. ఇందులో భాగంగానే తాను కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనట్లు దొరబాబు చెప్పారు. త్వరలోనే ఏ పార్టీలో చేరుతాననే విషయం తెలియజేస్తున్నానని దొరబాబు తెలిపారు.
కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..2014లో వైసీపీ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో పెండెం దొరబాబును కాకుండా వైసీపీ అధినేత జగన్..వంగా గీతను బరిలో దింపారు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్న ఆయన.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు నియోజకవర్గంలో మూడు మండలాల వైసీపీ నేతలు సైతం గుడ్ బై చెప్పారు.