Supreme Court: న్యాయవాదులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు తమ స్థానంలో కూర్చుంటే తమ ఒత్తిడి తెలుస్తుందని అన్నారు. ఓ కేసులో న్యాయవాది విచారణ ఆలస్యం అవుతోందని ముందుగా విచారణ చేపట్టాలని, తేదీని చెప్పాలని కోరగా .. సీజేఐ ఘూటుగా స్పందించారు. కోర్టుకు ఆదేశాలు జారీ చేయవద్దని హెచ్చరించారు.
మంగళవారం సుప్రీం కోర్టులో మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యేలు, ఎన్సీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత కేసులో శాసన సభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎమ్మెల్యేలపై గతంలో అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన యూబీటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.