Case Filed on MLC Bharath : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే గంటలతరబడి వేచి ఉండక తప్పదు. రూ.300 టికెట్లు తీసుకుని వెళ్లినా.. రద్దీ ఎక్కువగా ఉంటే కొంతసమయం పడుతుంది. కొందరు పలుకుబడి ఉన్నవారు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకుని దర్శనానికి వెళ్తుంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల నుంచి దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకుని వెళ్తే.. వారికి దర్శనం త్వరగా జరుగుతుంది.
అయితే.. పదవిని అడ్డంపెట్టుకున్న గుంటూరు వైసీపీ ఎమ్మెల్సీ.. సిఫారసు లేఖలు, తోమాల సేవలకు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. సిఫారసు లేఖలు, తోమాల సేవకు రూ.2.8 లక్షలు వసూలు చేసినట్లు ఎమ్మెల్సీ భరత్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ నేత చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అరండల్ పేట పోలీసులు ఎమ్మెల్సీ భరత్, అతని పీఏ మల్లిఖార్జునపై కేసు నమోదు చేశారు.