Pakistan : పాక్-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభానికి ముందు షాకింగ్ ఘటన జరిగింది. ఇంగ్లాండ్ టీమ్ బస చేసిన హోటల్కు సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముల్తాన్లో ఇంగ్లాండ్ జట్టు బస చేసిన హోటల్కు సమీపంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. హోటల్కు కిలోమీటర్ దూరంలో లోకల్ గ్యాంగ్స్ మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం.
పాక్ లో పర్యటించే ఇతర దేశాల క్రికెట్ జట్లకు భారీ భదత్ర కల్పిస్తున్నారు. గతంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగింది. అనంతరం ఆ దేశంలో ఇతర దేశాల జట్లు పర్యటనకు వెళ్లడంలేదు. ఇటీవ పలు దేశాలు పాక్లో క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన ముప్పు.. ఆ దేశంలో నిర్వహించే సిరీస్లపై ప్రభావం చూపించే అవకాశముంది. దీంతో విదేశీ ఆటగాళ్లకు పీసీబీ భారీ భద్రత కల్పిస్తోంది.
మరోవైపు వచ్చే ఏడాది పాక్లో నిర్వహించే ఆసియా కప్ లో భారత్ పాల్గొనడంపై చర్చ కొనసాగుంతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.