Peddireddy Ramachandra Reddy latest news(AP news live): పుంగనూరు నియోజకవర్గం ఆవులపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలను తెలిపేలా బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆవులపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ… పెద్దిరెడ్డి తమను ఏవిధంగా ఇబ్బంది పెట్టారో తెలిపేలా దారిపొడవునా ఫ్లెక్సీలు ఉంచారు.
పెద్దిరెడ్డి భూకబ్జాలకు బలయ్యామంటూ తెలిపేలా ఉరితాళ్లను వేలాడదీసి నిరసన తెలిపారు రైతులు. సోమల మండలం ఆవులపల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులు మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆవులపల్లి రిజర్వాయర్ కోసం సుమారు 1100 పైగా ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని.. అటవీ భూములుగా రికార్డుల్లో చూపించి పరిహారం రాకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పట్లో NGTకి వెళ్లిన రైతులు ప్రాజెక్టు నిర్మించకుండా ఆపగలిగారు కానీ.. అప్పటికే తమ భూముల్లోని మామిడి తోటలను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి తెలిపారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిర్వాసిత రైతులతో సమావేశం అయ్యారు. పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.