Viral News: రైల్వేలో తరచూ ఏదో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూస్తూనే ఉంటుంది. రైలులో స్టంట్స్ వేయడం, రీల్స్ చేయడం, ప్రమాదకరంగా పైకి ఎక్కి సెల్ఫీలు తీసుకోవడం ఇలా ఏదో ఒక ఘటనతో తరచూ నెట్టింట నిలుస్తుంటారు. అయితే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడిని రైలు ఎక్కి కూర్చోమని చెబితే ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. బాలుడు ఏకంగా రైలు ఇంజిన్ బోగిపైకి ఎక్కి కూర్చున్నాడు. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. రైలు పైకి ఎక్కమంటే ఏకంగా బోగిపైకే ఎక్కాడని సిబ్బంది షాక్ అయ్యారు.
ఈ ఘటన ఏపీలో వెలుగుచూసింది. ఏపీలోని బాపట్ల రైల్వే స్టేషన్లో ఓ బాలుడు ఇలా ప్రవర్తించాడు. గుడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్ లో ఆగిన రైలుపై బాలుడు హల్ చల్ చేయడం చూసి రైల్వే సిబ్బంది ఆశ్చర్యపోయారు. బాలుడిని దింపేందుకు నానాతంటాలు పడ్డారు. అయితే బాలుడిని రైలు ఎక్కి కూర్చోవాలి అని చెప్పడంతో అది అర్థం కాక రైలు ఇంజిన్ బోగిపైకి ఎక్కి కూర్చున్నాడు. దీంతో అందరూ హడలిపోయారు.
బాలుడిని కిందకు దించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. వెంటనే రైల్వే శాఖ సిబ్బంది కూడా అప్రత్తమైంది. విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. అనంతరం పోలీసులు, ఫైర్ శాఖకు సమాచరం అందించడంతో అందరూ ఘటన స్థలానికి చేరుకున్నాడు. బాలుడిని కిందకు దింపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే బాలుడు మతిస్థిమితం సరిగా లేదని, అందుకే ఇలా ప్రవర్తించాడని రైల్వే వెల్లడించింది. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని సిబ్బంది రక్షించింది.