Ind vs SL 2nd ODI Match Highlights: టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా సీనియర్లు ఇంకా రిలాక్స్ మోడ్ లోంచి బయటకు రాలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఫ్యామిలీలను వదిలి నెలల తరబడి ఉన్న క్రికెటర్లు, నేడు అలా ఉండలేక పోతున్నారని అంటున్నారు. ఇంటి బెంగ ఎక్కువై పోయిందని, హోమ్ సిక్ తో బాధపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యలో కోచ్ గౌతంగంభీర్ అనవసర ప్రయోగాలు జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. మొదటి వన్డేలో గిల్ బౌలింగు వేసి 14 పరుగులిచ్చాడు. ఆ ప్రయోగం ఆపి ఉంటే, టీమ్ ఇండియా ఒక్క పరుగుతో గెలిచేది. ఇక రెండో వన్డేలో సెకండ్ డౌన్ శివమ్ దుబె వచ్చాడు. తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. ఆ తర్వాత శ్రేయాస్, ఆ తర్వాత రాహుల్ ఇలా వచ్చారు.
ఇలా బ్యాటర్ల ఆర్డర్ మార్చడమంటే, ఆటగాళ్ల మైండ్ సెట్ మార్చడమేననే సంగతి అందరికీ తెలిసిందే. ఇదీ కరెక్ట్ కాదని అంటున్నారు. ఇకపోతే ఐపీఎల్ లో ధనాధన్ ఆడిన శివమ్ దూబె, అంతర్జాతీయ మ్యాచ్ ల్లో తేలిపోతున్నాడు. సీనియర్లందరూ మళ్లీ వచ్చారని సంతోషపడిన భారత అభిమానుల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరి ఆగస్టు 7న జరిగే చివరి మూడో వన్డేలో.. మన మొనగాళ్లకు మొనగాళ్లు ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.