9 devotees electrocuted in Bihar(National news today India): బీహార్లో ఘోరం జరిగింది. కావడి యాత్రికులు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కుకు హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో ఆరుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హాజీపూర్లోని ఇండస్ట్రియల్ ఏరియా సుల్తాన్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఇంకో లోతుల్లోకి వెళ్తే.. హాజీపూర్లోని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొంతమంది యాత్రికులు సోన్పూర్లో బాబా ఆలయానికి వెళ్తున్నారు. అర్థరాత్రి సమయంలో మినీ ట్రక్కులో యాత్రికులు పమెల్జా నుంచి గంగా జలాన్ని తీసుకెళ్తున్నారు. అందులో డీజేని కూడా తీసుకె ళ్లారు. అయితే డీజే వద్దని.. వైర్లు తగులుతాయని కొందరు చెప్పారు. ఏం పర్వాలేదని మరికొందరు వారించారు.
చివరకు డీజే ఎత్తు పొడవుగా ఉండడంతో హైఓల్టేజీ విద్యుత్ వైర్లకు తగిలాయి. స్పాట్లో 8 మంది మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడినవారిలో ఆరుగురు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనలో పోలీసులు నోరు విప్పారు.
ALSO READ: బీహార్ సీఎం కావాలంటే టెన్త్ పాసవ్వాలట..పీకే చెబుతున్న మాట
కావడి యాత్రికులు ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, ఆ డీజీకి 11 వేల వోల్టల విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. మరోవైపు స్థానికులు విద్యుత్ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. పదేపదే ఫోన్ చేసినప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఫలితంగా తొమ్మిది మంది మృతి చెందారని అంటున్నారు. దీనికి కారణం ముమ్మాటికీ విద్యుత్ శాఖ అధికారులేనని అంటున్నారు.