Investment by Chinese firms vital: భారత్, చైనా మధ్య వాణిజ్యం స్తంభించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో చైనాకు భారత్ ఓ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య వస్తువుల కొనుగోలుకు సంబంధించి దిగుమతి జరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్న వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే చైనా నుంచి మరిన్ని వస్తువుల కొనుగోలు విషయంలో దిగుమతి చేసుకునే బదులు భారత్ లోనే పెట్టుబడులు పెడితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని నీతి అయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి చైనాకు సూచించాడు.
చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం కంటే స్థానికంగానే ఆ వస్తువులను తయారీ చేసేందుకు చైనా ఇక్కడే కంపెనీలు స్థాపించడంతో పాటు పెట్టుబడి పెడితే మంచిదని సూచించారు. ఇలా వస్తువులను భారత్లో ఉత్పత్తి చేస్తే దేశానికి మంచిదని నీతి అయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి చెప్పారు.
Also Read: ‘ప్రధాని రాజీనామా చేయాలి’.. 91 మంది ఆందోళనకారులు దుర్మరణం
ఆర్థిక సర్వే ప్రకారం..అమెరికా, యూరప్ వంటి దేశాలు చైనా నుంచి ఉత్పత్తులను తగ్గించుకుంటున్నాయని వివరించారు. ఒకవేళ భారత్ లో తయార్యే చైనా ఉత్పత్తులను అమెరికాచ యూరప్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే ఆర్థికంగా భారత్ కూడా బలపడుతుందని చెప్పారు.