Crime News: యాదగిరిపల్లిలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. యాదగిరిపల్లిలోని ఓ ఫామ్హౌజ్లో యువకుడి మృతదేహం లభించింది. సందీప్ రెడ్డి మృతదేహం కనిపించింది. అనుమానాస్పద స్థితిలో బాడీ కనిపించడంతో పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు.
నిన్న రాత్రి ఆరుగురు మిత్రులు ఫామ్ హౌజ్కు వచ్చారు. రాత్రిపూట మద్యం సేవించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంకా తెలియదు. కానీ, ఫామ్హౌజ్లోని స్విమ్మింగ్ పూల్లో సందీప్ రెడ్డి విగతజీవిగా కనిపించారు. అక్కడి పరిసరాలు, పరిస్థితులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వేడుకలు చేసుకోవడం చాలా కామన్. కానీ, ఆ తర్వాత అజాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం ప్రాణాలకే ముప్పు. ఫ్రెండ్షిప్ డే రోజే జరిగిన చాలా రోడ్డు ప్రమాదాలు మనకు ఈ హెచ్చరికనే ఇస్తున్నాయి. గచ్చిబౌలిలో తెల్లవారుజామునే ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టి ఇద్దరు మృతి చెందారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ పైనా డివైడర్ను ఢీకొని ఇద్దరు బ్రిడ్జీపై నుంచి కింద పడి మరణించారు. ఓ కారు యాక్సిడెంట్ జరిగింది. మరో చోట కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదమే జరిగింది.
Also Read: వీటిని ఎక్కువగా తినేస్తున్నారా.. ఇవి మీ కిడ్నీని పాడు చేస్తాయి జాగ్రత్త..
కానీ, యాదగిరిపల్లిలో మాత్రం ఇందుకు భిన్నంగా.. అనుమానాస్పదమైన ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట మిత్రులంతా కలిసి ఎంజాయ్ చేసి.. లిక్కర్ తాగి వెళ్లిపోయారు. కానీ, ఉదయంపూట స్విమ్మింగ్ పూల్లో సందీప్ రెడ్డి నిర్జీవంగా నీటిలో కనిపించడం కలకలం రేపింది.