EPAPER

Adi Narayana Reddy: జగన్ లక్షల కోట్లు దోచేశాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

Adi Narayana Reddy: జగన్ లక్షల కోట్లు దోచేశాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

Adi Narayana Reddy comments on Jagan(AP Politics): ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కరే రూ.2 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. అంతే కాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 5 లక్షల కోట్లు స్వాహా చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా వైసీపీ చేసిన అక్రమాలు, కబ్జాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. వాటి గురించి ప్రజలను మరల్చేందుకు వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సున్నా అని ఎద్దేవా చేశారు. త్వరలోనే వైసీపీ కూడా అదే పరిస్థితికి వస్తుందని విమర్శించారు. మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సహా వైసీపీకి చెందిన నేతలు అనేక మంది వైసీపీ నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. దస్త్రాల దహనం, కాలువలో పారేయడం వంటి చర్యలకు వైసీపీ నేతలు పాల్పడ్డారని అన్నారు.

Also Read: జగన్ రేషన్..బాబు పరేషాన్


జగన్ పాలనలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం బయటపడుతుందని తెలిపారు. అంతే కాకుండా వైసీపీకి రాజకీయాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే భయంతోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కబ్జాలు, తప్పులు జరగని ప్రాంతం లేదని విమర్శించారు.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×