India Beat Great Britain Enter hockey Semi Finals: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ హాకీ జట్టు సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్పై విజయం సాధించింది. బ్రిటన్తో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత ఇరు జట్లకు చెరో పాయింట్ రావడంతో టై అయింది. ఆ తర్వాత జరిగిన షూటౌట్లో భారత్ సత్తా చాటింది. పెనాల్టీ షూటౌట్లో భారత్ 4-2తో గెలుపొందింది.
రెండో క్వార్టర్ ప్రారంభమైన కాసేపటికే భానత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. హాకీ స్టిక్తో బ్రిటన్ ఆటగాడి తలపై కావావలనే కొట్టిన్లు భావించిన రిఫరీలు ఆయనను రెడ్ కార్డ్ ద్వారా బయటకు పంపించేశారు. దీంతో భారత్..10 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. అయినప్పటికీ భారత్ పట్టు కోల్పోకుండా చివరి వరకు బ్రిటన్ గట్టిపోటీ ఇచ్చింది.
భారత్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించాడు. దీంతో భారత్ ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత 27వ నిమిషంలో మోర్టన్ లీ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. తర్వాత రెండు క్వార్టర్స్లో రెండు జట్లు గోల్ చేయలేదు. దీంతో మ్యాచ్ షూటౌట్కు దారి తీసింది.
Also Read: మోసం గురూ.. మన బాక్సర్ మెడల్ నొక్కేశారు!
షూటౌట్లో భారత్ 4-2 తేడాతో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. దీంతో షూటౌట్లో బ్రిటన్ను ఓడించి భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్ సెమీఫైనల్స్కు చేరి రికార్డు సృష్టించింది.
A famous victory!!!!
What a game. What a Shootout.
Raj Kumar Pal with the winning penalty shot.
We are in the Semis.
India India 🇮🇳 1 – 1 🇬🇧 Great Britain
SO: 4-2Harmanpreet Singh 22' (PC)
Lee Morton 27' #Hockey #HockeyIndia #IndiaKaGame #HockeyLayegaGold… pic.twitter.com/S01hjYbzGr
— Hockey India (@TheHockeyIndia) August 4, 2024