Abids Girl Kidnap Case Twist: హైదరాబాద్లోని అబిడ్స్లో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఆ బాలికపై కిడ్నాపర్ ఎండీ బిలాల్ అత్యాచారం చేసి ఉండొచ్చని అబిడ్స్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బాధిత బాలికను భరోసా సెంటర్కు తరలించారు.
బాధిత బాలికకు భరోసా సెంటర్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కిడ్నాప్ చేసిన బిలాల్ నేరచరిత్రను పోలీసులు తవ్వితీస్తున్నారు. కిడ్నాపర్ బీహార్కు చెందిన ఎండీ బిలాల్గా గుర్తించారు. బాలికను కిడ్నాప్ చేయకంటే ముందు అక్కడే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మొదట బాలికకు సైకిల్ కొనిస్తానని ఆశపెట్టాడని, ఆ తర్వాత మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత పాపను అడిగి ఆమె తండ్రి ఫోన్ నంబర్ తీసుకున్నట్లు గుర్తించారు. ఆటోలో ఎక్కించుకొని తర్వాత బస్సులో నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కిడ్నాపర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని పాపను కాపాడారు.
Also Read: అబిడ్స్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో కిడ్నాపర్
బిలాల్ను అరెస్ట్ ప్రశ్నిస్తే.. అతను పిల్లలను కిడ్నాప్ చేయడంలో నిష్ణాతుడు అని, పిల్లలను కిడ్నాప్ చేసి బీహార్కు తరలించి అమ్మేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.