Fire Accident in Vizag Railway Station: విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. రైల్వే పోలీసులు, అధికారులు ప్రయాణికులందరినీ బయటకు పంపి.. మంటలను అదుపు చేస్తున్నారు. ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.