Road Accident in Nallamala: నల్లమలలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెట్టుని కారు ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అమ్రాబాద్ మండలం నల్లమలలో జరిగిందీ ప్రమాదం. గాయపడిన వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులు హైదరాబాద్ లోని బొల్లారంకు చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.