Filmfare Awards South 2024: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రతి ఏడాది అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. సౌత్ సినీ పరిశ్రమకు సంబంధించి జరిగే ఈ అవార్డ్ వేడుకలకు ప్రముఖులు హాజరవుతుంటారు. తాజాగా, హైదరాబాద్లో జరిగిన 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
ఫిల్మ్ ఫేర్ గతేడాది ప్రతిభ కనబర్చిన నటీనటులను సన్మానించి అవార్డులు అందజేసింది. కాగా, ఈ అవార్డ్ వేడుకల్లో కొంతమంది నటీమణులు తమ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. అలాగే సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక రాశీ ఖన్నా, అపర్ణ బాలకమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ తమ ప్రదర్శనలతో అలరించారు.
2023లో నామినేట్ పొందిన సినిమాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఏయే సినిమా, ఏయే నటులు అందుకున్నారో తెలుసుకుందాం. ఇందులో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ పొందిన ‘బలగం’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు గెలుచుకున్నారు. ‘దసరా’ సినిమాలో నటనకు నాని, కీర్తి సురేష్ ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. అలాగు ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డు ఇద్దరికి వరించింది. దసరా సినిమాకు గానూ శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్న శౌర్యువ్ అందుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో నాని హీరోగా నటించడం విశేషం. దీంతోపాటు ‘బేబి’ సినిమాకు కూడా వివిధ విభాగాల్లో అవార్డులు వరించాయి.
Also Read: విజయ్ ‘గోట్’ మూవీ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్.. మీనాక్షి ఎంత అందంగా ఉంది రా బాబు
69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 తెలుగు విజేతలు..