File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు కనిపించిన సంఘటన ఏపీలో కలకలం రేపింది. విషయం బయటకు తెలియడంతో వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఫైల్స్ విషయంలో ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తారా? అంటూ ఫైరవుతున్నారు.
Also Read: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలంలో పర్యాటకుల సందడి
ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పశ్చిమ తహశీల్దార్ కార్యాలయం వద్ద చెత్తలో ప్రభుత్వ ఫైల్స్ కనిపించాయి. అయితే, ఇందుకు సంబంధించి సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునేలోపే వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మార్వో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది.