ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు తమ వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

అందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తాజాగా తన ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్‌ను ప్రకటించింది.

ఫ్రీడమ్ ఆఫర్ కింద ఒబెన్ రోర్ బైక్‌పై రూ.25000 భారీ తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,49,999గా ఉంది.

అయితే ఈ తాజా తగ్గింపుతో ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం రూ.1,24,999లకే కొనుక్కోవచ్చు.

ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. షోరూమ్‌ల్లో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ 2022 మార్చిలో లాంచ్ అయింది. ఈ బైక్‌లో 4.4 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ అమర్చారు.

ఈ బైక్‌కు ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఏకంగా 187 కి.మీ మైలేజీ అందిస్తుంది.

ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ కావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.

ఈ బైక్‌లో 8కిలోవాట్ల ఐబీఎంఎస్ఎమ్ మోటార్‌ను అందించారు. ఇది గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది.

ఇందులో సర్క్యులర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ అందించారు. అలాగే టర్న్ ఇండికేటర్లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు, టెయిల్ ల్యాంప్స్ వంటివి కలిగి ఉన్నాయి.