Actor Prashanth latest news(Celebrity news today): తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో ప్రశాంత్. తమిళంతోపాటు తెలుగులోనూ అడపా దడపా నటిస్తున్నాడు. తాను నటించిన ఓ సినిమా ప్రమోషన్ వెరైటీగా చేశాడు. రూల్స్ని అధిగమించాడు. పోలీసులు ఊరుకుంటారా? వెంటనే జరిమానా విధించారు.
జీన్స్ సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో ప్రశాంత్. పెద్దగా బైలింగువల్ సినిమాలు లేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం బిజీగానే ఉన్నాడు. పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మళ్లీ బిజీ అయ్యాడు. ప్రస్తుతం ద గోట్ మూవీలో కీలక రోల్ చేస్తున్నాడు. ఇదికాకుండా అంధగన్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రం మరో వారంలో రిలీజ్ కానుంది. తన సినిమా కోసం వెరైటీగా ప్రమోషన్ మొదలుపెట్టాడు హీరో ప్రశాంత్. ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అదేం తప్పుకాదు.. కాకపోతే చెన్నైలో రోడ్లపై బైక్ మీద తిరుగుతూ ఇంటర్వ్యూ ఇచ్చే కాన్సెప్ట్ అది.
ALSO READ: కోలీవుడ్ లో ఆగస్టు 15 తర్వాత షూటింగులు బంద్? నిర్మాతలు వెర్సెస్ నటులు
అసలే పెద్ద పెద్ద నగరాల్లో ట్రాపిక్ పోలీసులు కఠినంగా ఉంటారని చాలామంది చెబుతారు. ఎవరైనా రూల్స్ అధిగమిస్తే ఫైన్ వేస్తారు. హీరో ప్రశాంత్ విషయంలోనూ అదే చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల చెవిలో పడింది. దానికి సంబంధించిన వీడియోను గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండువేల రూపాయలు ఫైన్ వేశారు. ఈ విషయాన్ని చెన్నై ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
#ActionTaken on reported violation.#GreaterChennaiTraffic https://t.co/bAZecvNYgn pic.twitter.com/TqJVoLi9MT
— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) August 1, 2024