Pawan Kalyan Wishes Swapnil Kusale: పారిస్ ఒలింపిక్స్లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుశాల్ పతకం సాధించాడు. మొత్తం ఎనిమిది మందితో జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ షూటర్ 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకం గెలుచుకున్నాడు. మొదట నెమ్మదిగా ప్రారంభించిన కుశాల్.. తర్వాత కీలక సమయంలో పుంజుకున్నాడు.
అయితే కుశాల్ కాంస్య పతకం సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగానే స్వప్నిల్ కుశాల్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ‘దేశానికి మరో పతకం దక్కడం సంతోషాన్ని కలిగించింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించిన యువ షూటర్ స్వప్నిల్ కుశాలెకు హృదయపూర్వక అభినందనలు. ఈ ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’. అంటూ పేర్కొన్నారు.