Foundation stone for skill University: హైదరాబాద్ శివారులోని కందుకూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే జాబ్ క్యాలెండర్ ప్రకటన: మంత్రి పొంగులేటి
మీర్ ఖాన్ పేట దగ్గర పంజగూడ గ్రామంలో ప్రభుత్వం స్కిల్ వర్సిటీని నిర్మిస్తున్నది. స్కిల్ యూనివర్సిటీకి 57 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ యూనివర్సిటీలో యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 17 కోర్సుల్లో ప్రతి ఏటా 20 వేల మంది రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇవ్వనున్నారు. యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.