Free Wifi For 3 Months: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో Wi-Fi కనెక్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో పోటీ బాగా పెరగడానికి ఇదే కారణం. అన్ని ఇంటర్నెట్ ప్రొవైడర్లు కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడానికి పోటీ పడుతున్నారు. ఒక విధంగా జియో కొత్త వినియోగదారులకు ఉచిత ఇన్స్టాలేషన్ సేవను అందిస్తోంది.
దేశీయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎక్సిటెల్ తన కస్టమర్ల కోసం మాన్సూన్ హంగామా 2.0 ఆఫర్ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద, excitel వినియోగదారులకు 3 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్, 16 OTTతో పాటు 300 టీవీ ఛానెల్ల బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఎక్సైట్ మాన్సూన్ ఆఫర్ విషయానికి వస్తే ఈ స్పెషల్ ఆఫర్ జూలై 29 నుండి ఆగస్టు 4, 2024 వరకు అమలులో ఉంటుంది. కస్టమర్లకు హైస్పీబ్ ఇంటర్నెట్,. OTT ప్లాట్ఫారమ్కు సబ్స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్రయోజనాలు Excitel మాన్సూన్ ఆఫర్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లో మూడు నెలల ఉచిత ఇంటర్నెట్ సేవలు, 16 OTT ప్లాట్ఫామ్లు, 300 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్లు ఉన్నాయి. అంతేకాకుండా కస్టమర్లు ఉచితంగా కూడా ఇన్స్టాలేషన్ బెనిఫిట్ కూడా పొందుతారు. Excitel ఈ ప్లాన్ ధర నెలకు రూ. 349.
ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందడానికి వినియోగదారులు రూ. 3699.ఈ ప్లాన్లో వినియోగదారులకు 6 నెలలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్లాన్లో లభించే అన్ని ప్రయోజనాలు 9 నెలల పాటు అందుబాటులో ఉంటాయి. అంటే వినియోగదారులు 3 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్, OTT, టీవీ కనెక్షన్లను పొందుతున్నారు. దీనితో పాటు వినియోగదారులు దాదాపు రూ. 1500 కూడా డబ్బును ఆదా చేసుకుంటారు.
Also Read: Motorola Edge 50 Launch: మోటో సందడి.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో కొత్త ఫోన్ లాంచ్!
అంతేకాకుండా సబ్స్క్రైబర్లు 200 Mbps కనెక్షన్లతో హై-స్పీడ్ ఇంటర్నెట్ను ఆనందిస్తారు. OTT ప్లాట్ఫారమ్ ప్యాకేజీలో SonyLIV, Shemaroo, AltBalaji వంటి ప్రముఖ సేవలు ఉన్నాయి. ఎక్సైటెల్ తన కేబుల్ కట్టర్ ప్లాన్తో బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో కాంపిటీటర్గా నిలవనుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి దీన్ని బుక్ చేసుకోవచ్చు.