New York : ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా శక్తివంతమైన 100 మహిళల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్లో భారత్ నుంచి నిర్మలా సీతారామన్ 34వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భారత్ నుంచి చోటు దక్కించుకున్న మహిళల్లో ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. తరువాత 53వ స్థానంలో హెచ్సీఎల్ చైర్ పర్సన్ రోష్ని నాడార్, 54వ స్థానంలో సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్ చోటు సంపాదించుకున్నారు. సెయిల్ చైర్ పర్సన్ సోమా మండల్ 67వ స్థానంలో నిలవగా.. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 72వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక 100 మంది జాబితాలో చివరి భారత మహిళ.. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ 89వ పొజిషన్లో నిలిచారు.
మొత్తం 100 మంది జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కరోనా మహమ్మరిని ఎదర్కోవడం..ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు ఆమె చేసిన కృషికిగాను ఆమెకు ఈ స్థానాన్ని ఇచ్చారు. 100వ స్థానంలో ఇరాన్కు చెందిన జినా ‘మహ్సా’ ఆమిని నిలిచారు.