Duvvada : దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు కింద ఇరుక్కుపోయి బయటపడిన యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలుకు, ప్లాటుఫాంకు మధ్య ఇరుక్కొని నరకయతన అనుభవించింది. రైల్వే సిబ్బంది అతికష్టం మీద ఆమెను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడి చివరకి ఆమె చనిపోయింది. ఈఘటనలో శశికళ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రైలు ప్రయాణం విషాదంగా మారడంపై కన్నీటి పర్యంతం అవుతున్నారు