Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలాహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అసంబద్దమని.. అవసరమైతే తిరిగి రెండు రాష్ట్రాలను కలపాలని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కేసు కూడా పెండింగ్లో ఉందన్నారు సజ్జల. అదే జరిగితే స్వాగతించే వారిలో వైసీపీ ముందుంటుందన్నారు.
వైసీపీ పార్టీ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాడిందని..కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ విభజనను సమర్ధించాయని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు కోసమే వైసీపీ పోరాడుతోందన్నారు. రెండు రాష్ట్రాలు తిరిగి కలిసి ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే వైసీపీకి ఇంకేం కావాలన్నారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. బీసీ సభ సక్సస్ కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని..అందుకే విషయం కక్కుతున్నట్లు కామెంట్ చేశారు.