Rivaba : గుజరాత్ ఎన్నికల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య విజయం సాధించారు. జామ్నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున రవీంద్ర జడేజా భార్య రివాబా పోటీ చేశారు. సమీప ప్రత్యర్థిపై 61 వేల ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. ఇది అందరి విజయంగా రివాబా జడేజా అభివర్ణించారు.
క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జడేజా సోదరి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. రివాబా పోటీ చేసిన జామ్ నగర్ నార్త్ లో జడేజా సోదరి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం ఆసక్తి రేపింది. అయినా సరే రివాబా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా విజయం కోసం శ్రమించారు. రోడ్ షోలకే పరిమితం కాకుండా ఇంటింటికి తిరిగారు. ఎన్నికల ఫలితాల్లో తొలిరౌండ్ లో రివాబా వెనుకబడ్డారు. అయితే ఆ తర్వాత పుంజుకుని చివరికి భారీ మెజార్టీ సాధించారు. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.