Harish Rao : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. గట్ల మల్యాల గ్రామంలో వాటర్ ట్యాంకును, గొర్రెల షెడ్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు కానీ నూకలు బుక్కుమని అంటున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తుందని..తాము ససేమిరా అనడంతో నిధులను ఆపుతుందని ధ్వజమెత్తారు. గత 5 ఏండ్లలో 30 వేల కోట్లు ఆపారని కేంద్రంపై ఫైర్ అయ్యారు హరీశ్.