AP Weather : తమిళనాడు, దక్షిణ కోస్తాంద్రలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండమే తుఫానుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడుతోపాటు, ఆంధ్రప్రతేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలోని వాయుగుండం 9న శ్రీహరికోట, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల వరకు చెన్నై, పుదుచ్చెరీ, దక్షిణ కోస్తా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మండూస్ తుఫాన్ తీరం దాటిన తరువాత..గంటకు 65 నుంచి 75 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు ప్రజల్ని తీరం వద్దకు వెళ్లవద్దని చెబుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు కూడా వెళ్లొద్దని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేశారు.