Ranga Reddy : రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని నాలుగో తరగతి విద్యార్థిని టీచర్లు, వంట సిబ్బందిపై కేసు పెట్టింది. అన్నంలో పురుగులు వస్తున్నాయని టీచర్ కి చెప్పినందుకు టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని చిన్నారి వాపోయింది.
చిన్నారి తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డి వెంటనే సిబ్బందిని స్కూల్ కి పంపించి విచారణ జరిపించారు. స్కూల్లో వండుతున్న కూరగాయలు, బియ్యంను పోలీసులు పరిశీలించారు. కుళ్లిపోయిన కూరగాయలు, చెడిపోయిన ఆయిల్, పురుగులతో ఉన్న బియ్యంను గుర్తించినప పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్ కి తరలించారు