Spain : స్పెయిన్లో రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాకు సమీప స్టేషన్లో ఆగిఉన్న ఓ ట్రైన్ను వెనకనుంచి వచ్చిన మరో రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. చాలా మందికి స్వల్పగాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. 39 మందిని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రవాణా శాఖ మంత్రి రాకెల్ సాంషెజ్.. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రయాణికులకు హామీ ఇచ్చారు.