Sri Reddy Emotional on YS Jagan(AP news today telugu): నిత్యం వివాదాలతో తలపడటం ఆమె నైజం. రాజకీయ ప్రముఖులనైనా, మీడియా ప్రతినిధులైనా, తనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ముందూ వెనకా చూడకుండా వారిని ఏకి పారేస్తుంటుంది. ఇంతకీ ఎవరో ఇప్పటికే అర్థమయిందనుకుంటా..ఆమే శ్రీరెడ్డి వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్. వైఎస్ఆర్ సీపీకి ఎప్పుడూ మద్దతునిచ్చి మాట్లాడే శ్రీరెడ్డి గత ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణంరాజులపై మామూలుగా విరుచుకుపడలేదు. వ్యక్తిగత దూషణలు ఒక్కో సారి పరిధి కూడా దాటిపోతాయి. అసభ్య పదజాలంతో, ఏక వచన ప్రయోగంతో టార్గెట్ చేస్తుంటుంది శ్రీరెడ్డి.
తక్కువచేస్తే ఊరుకోదు
ఒక్కో సారి తనకి సంబంధం లేని వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటుంది. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీ నేతను జగన్ ను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తుంటుంది. జగన్ ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా వాళ్లపై తనదైన శైలిలో అసభ్య పదజాలంతో వాళ్లను పబ్లిక్ గా తిట్టేస్తుంటుంది. మొన్నటి ఎన్నికల ముందు జగన్ తప్పకుండా గెలిచి తీరతాడని అప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ మొహం ఎక్కడో పెట్టుకుంటారని ఓపెన్ చాలెంజ్ లు చాలానే చేసింది. జగన్ మొన్నటి ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలవడంతో కొంత కాలం సైలెంట్ గానే ఉన్న శ్రీరెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది.
ఇవిగో నీ జ్ణాపకాలు
ఎప్పుడూ జగన్ పాలనను వెనకేసుకొచ్చే శ్రీరెడ్డి ఈ సారి ఏకంగా జగన్ ను ఉద్దేసించి ఓ పోస్ట్ పెట్టింది. కోట్లాది మందికి మంచి చేసిన ఆఅభిమానం, ఆప్యాయతలు ఏమయ్యాయి నీమీద అంటూ నిన్నే తలచుకుంటూ నీ జ్ణాపకాలను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. అంటూ జగన్ సంక్షేమ పథకాల కరపత్రాలను బెడ్ కింద దాచిపెట్టిన వీడియోను షేర్ చేసింది. అది చూసి శ్రీరెడ్డిపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. అయ్యో పాపం జగన్ మీద అంతలా ప్రేమ పెంచుకున్నావా శ్రీరెడ్డీ. జ్ణాపకాలను భద్రంగా దాచుకో..మళ్లీ జగన్ వచ్చేదాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ సారి జగన్ మళ్లీ సీఎం అయితే నీకు హోం మంత్రి ఇస్తారేమో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ తగ్గించుకో శ్రీరెడ్డీ అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. అది వివాదమైనా వినోదమైనా..