Two Children among four killed: జమ్మూకాశ్మీర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. జాతీయ వార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఉన్న షేర్ కాలనీలో ఉన్న ఓ స్క్రాప్ షాపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్పై సీబీఐ ఛార్జ్
ఈ ఘటన పై అధికారులు మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారని చెప్పారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు తెలిపారు. ఘటన షేర్ కాలనీలో జరిగిందని చెప్పారు. మృతులు స్క్రాప్ షాప్ డీలర్లని చెప్పారు. లడాఖ్ నుంచి స్క్రాప్ ను తీసుకొచ్చారని, అది అన్ లోడ్ చేస్తున్న తరుణంలో పేలుడు సంభవించిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.