Husband Commits Suicide after killing his wife in Rajanna Sirisilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శాంతినగర్లో దూస రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మికి గత కొన్ని నెలలుగా గొడవులు జరుగుతున్నాయి. తరుచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో.. రాజేశం ఫుల్ గా మధ్యం సేవించి క్షణికావేశంతో భార్యను బెడ్ రూంలో ముఖంపై కొట్టి చంపి.. ఆ తర్వాత అతను ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.
చనిపోయిన రాజేశంకు గత ఆరు నెలల నుంచి ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు.. సరైన ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నాడని స్థానికులు చెప్పారు. రాజేశంకు కిడ్ని సమస్యలున్నాయని. డయాలసిస్ పేషేంట్గా ఉన్నట్లు తెలిపారు. మృతిచెందిన దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉంది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.
Also Read: దొంగతనం జరిగిన కారు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభ్యం!.. ఏం జరిగిందంటే?
పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చూడగా తల్లిదండ్రులు విగజీవిగా పడి ఉండటం చూసి పిల్లలు భోరుమనిపించారు. తల్లిదండ్రులు గొడవలు వారి పిల్లలకు శాపంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.