JSP Leader Nagababu Latest Tweet: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు జనసేన నేత నాగబాబు. ఇటీవలే ఓ వీడియోను పోస్ట్ చేసి.. జగన్పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ హయాంలో ఘటనలు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు అడుగుతున్నావ్..? గతంలో ఎందుకు అడుగలేదంటూ ఆయన నిలదీశారు. కేవలం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉండేందుకే ఈ నాటకాలంటూ ఆయన జగన్పై మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో పోస్ట్ పెట్టారు. అయితే, ఈసారి జగన్కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. జగన్కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో నైట్టింట వైరల్గా మారింది. ప్రస్తుతం ఏపీలో దీనిపై భారీగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల ప్రకారం..
Also Read: ఏపీ రాజకీయాల్లో సంచలనం, విజయమ్మతో జేసీ ప్రభాకర్ భేటీ,
‘జగన్కు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ నాగబాబు ట్వీట్లో ఇలా పేర్కొన్నారు. జగన్కు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే.. 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయనపై కోడికత్తితో దాడి చేశాడు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఆ ఐదేళ్లు జగన్కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల అది కుదర్లేదు. ఇప్పుడు జగన్ ఖాళీగానే ఉన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనపై హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా!.. అందుకే కేసును వెంటనే విచారించి అమాయకుడైన జగన్కు న్యాయం చేయవలసిందిగా నేను కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ను, హోం మంత్రి అనితను కోరుతున్నాను’ అంటూ నాగబాబు ఆ ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.