EPAPER

Road Accident: సంగారెడ్డిలో కారును ఢీకొట్టిన ట్రక్కు..ఇద్దరు స్పాట్ డెడ్

Road Accident: సంగారెడ్డిలో కారును ఢీకొట్టిన ట్రక్కు..ఇద్దరు స్పాట్ డెడ్

Road Accident in SangaReddy (Telangana News): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్‌కల్ మండంలోని హుసెల్లి వద్ద వేగంగా వచ్చిన ఓ ట్రక్కు..కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.


జహీరాబాద్ – బీదర్ రహదారిపై సోమవారం ఉదయం కారును ట్రక్కు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ తోపాటు ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని బీదర్ వాసులుగా గుర్తించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


 

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×