EPAPER

North Korea: అధ్యక్షుడి ఆదేశాలతో ఆ రెండు దేశాలతో యుద్ధం

North Korea: అధ్యక్షుడి ఆదేశాలతో ఆ రెండు దేశాలతో యుద్ధం

North Korea: కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిమ్ జోంగ్ సహా సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు ఒక వేళ యుద్ధం జరిగితే అధినేత ఆదేశాలతో శత్రువులను అంతం చేస్తామని తెలిపారు. సైనికులు ఈ విధంగా స్పందించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటించింది.


దక్షిణ కొరియా, అమెరికా అణు యుద్ధానికి రెచ్చగొడుతున్నాయి. ఈ తరుణంలోనే అధ్యక్షుడు ఆదేశాలతో శత్రువుల వినాశనం కోసం అవసరమైన యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని సైనిక అధికారులు ప్రతిజ్జ చేశారు. దక్షిణ కొరియా యుద్ధానికి విరామం ఇస్తూ అమెరికా, చైనాలతో జులై 27, 1953 న ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి కుదుర్చుకుంది. జులై 27న విక్టరీ దినోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా ఉత్సవాలు నిర్వహిస్తుండగా దక్షిణ కొరియా మాత్రం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించదు. అయితే, అది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తోంది.

Also Read: ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్


ఒప్పందం జరగకపోవడంతో ఇరు పక్షాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లే అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు అమెరికా, ఉత్తర కొరియా మధ్య కొంత కాలంగా దౌత్య సంబంధాలు లేకపోవడంతో పాటు అణు నిరాయుధీకరణపై 2019 నుంచి చర్యలు కూడా నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా ఈ పరిణామంలో మార్పు ఉంటుందిని ఆశించడం లేదని ఉత్తర కొరియా పేర్కొంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×