Paris Olympics 2024: పారా ఒలింపిక్స్ లో భాగంగా తన తొలి మ్యాచ్లోనే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం సాధించింది. ఈ పోటీల్లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్లో పీవీ సింధు గెలిచింది. గ్రూప్ స్టేజీలో మాల్దీవులకు చెందిన ఫాతిమా నమాన అబ్దల్ రజాఖ్పై ఆమె విజయం సాధించింది. ఈ మేరకు 21-9, 21-6 తేడాతో పీవీ సింధు సునాయసంగా గెలిచి శుభారంభం చేసింది.
అయితే మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్..సింధుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో వరుస గేమ్ల్లో సింధు గెలిచింది. కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇక సింధు.. తన రెండో గ్రూప్ ఎం మ్యాచ్లో జూలై 31న బుధవారం ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కుబాతో తలపడనుంది.
ఇదిలా ఉండగా, పారిస్ ఒలింపిక్స్లో పీవీ సింధు దూసుకెళ్తోంది. ఇప్పటికే ఒక రజత పతకంతోపాటు మరో కాంస్య పతకం సాధించింది. అయితే వరుసగా రెండు పతకాలను తన ఖాతాలో వేసుకున్న సింధు మూడో పతకంపై కన్నేసింది. 2016లో రజత పతకం, 2021లో టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించింది. పారిస్ లోనూ పతకం సాధిస్తే.. వరుసగా మూడు పతకాలు సాధించిన తొలి అథ్లెట్గా సింధు రికార్డు సృష్టించనుంది.