KCR : జగిత్యాల బహిరంగ సభలో కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. దేశంలో రైతు బంధు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణానే అని స్పష్టం చేశారు. అలాగే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణానే అని చెప్పారు. ఐతే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటుకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. మరి మీటర్లు పెడదామా అంటూ సభలో జనాల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. 35 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసీ సంస్థని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఇక బేటీ బచావో.. బేటీ పడావో గొప్పగా కొటేషన్స్ చెప్పి.. ఆఖరికి అంగన్ వాడీ సొమ్ములను కూడా వాడేశారని ఫైరయ్యారు. అలాగే మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పి.. 10 వేల సంస్థలు మూతపడడానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల మంది ఉద్యోగాల కోల్పోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అసురిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని అంతా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు